ఆమ్నేస్టి సమయంలో గల్ఫ్ కార్మికుల కోసం ఉచిత విమాన టికెట్ అందజేయాలి...
- September 09, 2024
దుబాయ్: యూఏఈలో ఆమ్నేస్టి ప్రకటించడం జరిగింది.చాలా కాలంగా దుబాయ్ లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు ఇంటికి ఎలాంటి అపరాధ రుసుము జైలు శిక్ష లేకుండా భారత్కు వెళ్లడానికి ఇది మంచి అవకాశం దీన్ని ప్రకటించినటువంటి యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదములు అదేవిధంగా గల్ఫ్ సోదరులందరూ ఈ సమయాన్ని సద్వినియోగించుకోవాలనిఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ కన్వీనర్ కుంబాల మహేందర్ రెడ్డి కోరారు.ఇది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30 అక్టోబర్ 2024 తేదీ వరకు ఉంటుంది.ఈ సమయంలో దుబాయ్ లో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల కోసం కావాల్సినటువంటి పత్రాలను పోలీస్ వెరిఫికేషన్ ను, పాస్పోర్ట్ లను ఇవన్నీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి భారత కౌన్సిలర్ ఆఫీసర్లు మరియు రాయబార కార్యాలయంకు చెందినటువంటి అధికారులు సులువుగా వారికి అనుమతి పత్రాలు చేసి ఇస్తున్నారు కావున దుబాయ్ నుండి హైదరాబాదుకు పంపించడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దుబాయ్ లో ఉన్నటువంటి ఉభయ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ అధికారులను దుబాయ్ కు పంపించి కార్మికులకు ఉచిత విమానయాన సదుపాయాన్ని కల్పించి, దుబాయ్ నుండి హైదరాబాద్ కు విమాన టికెట్లు ఉచితంగా ఇవ్వగలరని ఇండియన్ పీపుల్స్ ఫోరం దుబాయ్ తరఫున కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో కుంబాల మహేందర్ రెడ్డి (కన్వీనర్ ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ ),డొక్కా శ్రీని,అపర్ణ, హరి, వేణుగోపాల్,రాజు, శ్రీనివాస్,నిమ్మల కృష్ణ, కృష్ణ మేగీ తదితరులు పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









