షార్జాలో విషాదం.. స్కూల్ పైకప్పు కూలి ఇద్దరు మృతి..!
- September 09, 2024
యూఏఈ: షార్జాలోని కల్బా సిటీలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అలీ అల్-ఖమౌడీ మాట్లాడుతూ.. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించామని, చనిపోయిన వ్యక్తులు అరబ్, ఆసియా జాతీయులని పేర్కొన్నారు. షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ, కల్బా కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్, క్రైమ్ సీన్ టీమ్, నేషనల్ అంబులెన్స్, కల్బా సిటీ మున్సిపాలిటీతో సహా అన్ని ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయని పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు షార్జా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







