ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్టుగా ‘గల్ఫ్ రైల్వే’..!
- September 09, 2024
మనామా: $250 బిలియన్ల అంచనా వ్యయంతో రూపొందుతున్న గల్ఫ్ రైల్వే ప్రాజెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ మేరకు ప్రముఖ మార్కెట్ డేటా ప్రొవైడర్ అయిన స్టాటిస్టా ప్రకటించింది. ట్రాన్స్-యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ($600 బిలియన్లు), NEOM సిటీ ($500 బిలియన్లు) మాత్రమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కంటే ముందున్నాయి.
2030 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. గల్ఫ్ రైల్వే సౌదీ అరేబియాలోకి 21 కి.మీ మరియు బహ్రెయిన్లోకి 24 కి.మీ విస్తరించి, కింగ్ హమద్ కాజ్వేని దాటుతుంది. చివరికి కువైట్లో ప్రారంభమయ్యే గల్ఫ్ రైల్వే నెట్వర్క్తో కలుస్తుంది. ఇది డమ్మామ్ గుండా బహ్రెయిన్ లోకి వెళుతుంది.
దమ్మామ్ నుండి ఇది ఖతార్ను బహ్రెయిన్కు కలుపుతూ సల్వా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఖతార్ వరకు కొనసాగుతుంది. ఈ రైల్వే లైన్ సౌదీ అరేబియా నుండి అబుదాబి, అల్ ఐన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి, చివరికి సుహార్ విలాయత్ ద్వారా మస్కట్కు వరకు చేరుకుంటుంది. అలాగే సుహార్, అబుదాబిలను కలిపే మార్గాన్ని నిర్మించి, నిర్వహించడానికి ఒమన్ రైలు, ఎతిహాద్ రైలు మధ్య జాయింట్ వెంచర్ కూడా ఏర్పాటైంది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







