ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్టుగా ‘గల్ఫ్ రైల్వే’..!
- September 09, 2024
మనామా: $250 బిలియన్ల అంచనా వ్యయంతో రూపొందుతున్న గల్ఫ్ రైల్వే ప్రాజెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ మేరకు ప్రముఖ మార్కెట్ డేటా ప్రొవైడర్ అయిన స్టాటిస్టా ప్రకటించింది. ట్రాన్స్-యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ($600 బిలియన్లు), NEOM సిటీ ($500 బిలియన్లు) మాత్రమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కంటే ముందున్నాయి.
2030 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. గల్ఫ్ రైల్వే సౌదీ అరేబియాలోకి 21 కి.మీ మరియు బహ్రెయిన్లోకి 24 కి.మీ విస్తరించి, కింగ్ హమద్ కాజ్వేని దాటుతుంది. చివరికి కువైట్లో ప్రారంభమయ్యే గల్ఫ్ రైల్వే నెట్వర్క్తో కలుస్తుంది. ఇది డమ్మామ్ గుండా బహ్రెయిన్ లోకి వెళుతుంది.
దమ్మామ్ నుండి ఇది ఖతార్ను బహ్రెయిన్కు కలుపుతూ సల్వా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఖతార్ వరకు కొనసాగుతుంది. ఈ రైల్వే లైన్ సౌదీ అరేబియా నుండి అబుదాబి, అల్ ఐన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి, చివరికి సుహార్ విలాయత్ ద్వారా మస్కట్కు వరకు చేరుకుంటుంది. అలాగే సుహార్, అబుదాబిలను కలిపే మార్గాన్ని నిర్మించి, నిర్వహించడానికి ఒమన్ రైలు, ఎతిహాద్ రైలు మధ్య జాయింట్ వెంచర్ కూడా ఏర్పాటైంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









