ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్టుగా ‘గల్ఫ్ రైల్వే’..!
- September 09, 2024
మనామా: $250 బిలియన్ల అంచనా వ్యయంతో రూపొందుతున్న గల్ఫ్ రైల్వే ప్రాజెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ మేరకు ప్రముఖ మార్కెట్ డేటా ప్రొవైడర్ అయిన స్టాటిస్టా ప్రకటించింది. ట్రాన్స్-యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ($600 బిలియన్లు), NEOM సిటీ ($500 బిలియన్లు) మాత్రమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కంటే ముందున్నాయి.
2030 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. గల్ఫ్ రైల్వే సౌదీ అరేబియాలోకి 21 కి.మీ మరియు బహ్రెయిన్లోకి 24 కి.మీ విస్తరించి, కింగ్ హమద్ కాజ్వేని దాటుతుంది. చివరికి కువైట్లో ప్రారంభమయ్యే గల్ఫ్ రైల్వే నెట్వర్క్తో కలుస్తుంది. ఇది డమ్మామ్ గుండా బహ్రెయిన్ లోకి వెళుతుంది.
దమ్మామ్ నుండి ఇది ఖతార్ను బహ్రెయిన్కు కలుపుతూ సల్వా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఖతార్ వరకు కొనసాగుతుంది. ఈ రైల్వే లైన్ సౌదీ అరేబియా నుండి అబుదాబి, అల్ ఐన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి, చివరికి సుహార్ విలాయత్ ద్వారా మస్కట్కు వరకు చేరుకుంటుంది. అలాగే సుహార్, అబుదాబిలను కలిపే మార్గాన్ని నిర్మించి, నిర్వహించడానికి ఒమన్ రైలు, ఎతిహాద్ రైలు మధ్య జాయింట్ వెంచర్ కూడా ఏర్పాటైంది.
తాజా వార్తలు
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...









