ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్టుగా ‘గల్ఫ్ రైల్వే’..!
- September 09, 2024
మనామా: $250 బిలియన్ల అంచనా వ్యయంతో రూపొందుతున్న గల్ఫ్ రైల్వే ప్రాజెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మెగా-ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ మేరకు ప్రముఖ మార్కెట్ డేటా ప్రొవైడర్ అయిన స్టాటిస్టా ప్రకటించింది. ట్రాన్స్-యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ($600 బిలియన్లు), NEOM సిటీ ($500 బిలియన్లు) మాత్రమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కంటే ముందున్నాయి.
2030 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. గల్ఫ్ రైల్వే సౌదీ అరేబియాలోకి 21 కి.మీ మరియు బహ్రెయిన్లోకి 24 కి.మీ విస్తరించి, కింగ్ హమద్ కాజ్వేని దాటుతుంది. చివరికి కువైట్లో ప్రారంభమయ్యే గల్ఫ్ రైల్వే నెట్వర్క్తో కలుస్తుంది. ఇది డమ్మామ్ గుండా బహ్రెయిన్ లోకి వెళుతుంది.
దమ్మామ్ నుండి ఇది ఖతార్ను బహ్రెయిన్కు కలుపుతూ సల్వా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఖతార్ వరకు కొనసాగుతుంది. ఈ రైల్వే లైన్ సౌదీ అరేబియా నుండి అబుదాబి, అల్ ఐన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి, చివరికి సుహార్ విలాయత్ ద్వారా మస్కట్కు వరకు చేరుకుంటుంది. అలాగే సుహార్, అబుదాబిలను కలిపే మార్గాన్ని నిర్మించి, నిర్వహించడానికి ఒమన్ రైలు, ఎతిహాద్ రైలు మధ్య జాయింట్ వెంచర్ కూడా ఏర్పాటైంది.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!