ఇండియాలో మూడు తరాల సంప్రదాయాన్ని సజీవంగా నిలిపిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్..!
- September 10, 2024
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాజ్ఘాట్ వద్ద అమల్టాస్ (కాసియా ఫిస్టులా) మొక్కను నాటారు.అయితే, ఇండియాలో పర్యటిస్తున్న బుదాబి క్రౌన్ ప్రిన్స్ యూఏఈ రాజ కుటుంబం నుండి మూడవ తరం నాయకుడిగా గుర్తింపు పొందారు.రాజ్ఘాట్ చరిత్రలో ఒకే దేశం నుండి మూడు తరాల నాయకులు మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించి చెట్లను నాటడం ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇది ఇండియా-యూఏఈ దేశాల మధ్య లోతైన సంబంధాన్ని సూచిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. 1992లో యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ భారతదేశ పర్యటన సందర్భంగా రాజ్ఘాట్ వద్ద అమల్టాస్ (కాసియా ఫిస్టులా) మొక్కను నాటారు. 2016లో అతని కుమారుడు, ప్రస్తుత యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మోల్శ్రీ (మిముసోప్స్ ఎలెంగి) మొక్కను నాటడం ద్వారా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









