ఇండియాలో మూడు తరాల సంప్రదాయాన్ని సజీవంగా నిలిపిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్..!
- September 10, 2024
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాజ్ఘాట్ వద్ద అమల్టాస్ (కాసియా ఫిస్టులా) మొక్కను నాటారు.అయితే, ఇండియాలో పర్యటిస్తున్న బుదాబి క్రౌన్ ప్రిన్స్ యూఏఈ రాజ కుటుంబం నుండి మూడవ తరం నాయకుడిగా గుర్తింపు పొందారు.రాజ్ఘాట్ చరిత్రలో ఒకే దేశం నుండి మూడు తరాల నాయకులు మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించి చెట్లను నాటడం ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇది ఇండియా-యూఏఈ దేశాల మధ్య లోతైన సంబంధాన్ని సూచిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. 1992లో యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ భారతదేశ పర్యటన సందర్భంగా రాజ్ఘాట్ వద్ద అమల్టాస్ (కాసియా ఫిస్టులా) మొక్కను నాటారు. 2016లో అతని కుమారుడు, ప్రస్తుత యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మోల్శ్రీ (మిముసోప్స్ ఎలెంగి) మొక్కను నాటడం ద్వారా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







