రియాద్లో భారత-ఒమన్ విదేశాంగ మంత్రుల భేటీ..!
- September 10, 2024
మస్కట్: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. రియాద్లోని జిసిసి సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జిసిసి-ఇండియా మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది.రెండు దేశాల మధ్య సంబంధాలు, సహకారంపై సమీక్షించారు.ప్రస్తుత ప్రాంతీయ భద్రతా సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భద్రత, శాంతి మరియు న్యాయాన్ని నెలకొల్పడానికి అంతర్జాతీయ చట్టం నియమాలను అమలు చేయడానికి కట్టుబడి ఉండాలని ఇద్దరు మంత్రులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సౌదీ అరేబియా (KSA)లోని ఒమన్ రాయబారి హెచ్హెచ్ సయ్యద్ ఫైసల్ బిన్ టర్కీ అల్ సయీద్, GCC మరియు ప్రాంతీయ పొరుగు విభాగం అధిపతి షేక్ అహ్మద్ బిన్ హషీల్ అల్ మస్కారీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









