రియాద్‌లో భారత-ఒమన్ విదేశాంగ మంత్రుల భేటీ..!

- September 10, 2024 , by Maagulf
రియాద్‌లో భారత-ఒమన్ విదేశాంగ మంత్రుల భేటీ..!

మస్కట్: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. రియాద్‌లోని జిసిసి సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జిసిసి-ఇండియా మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది.రెండు దేశాల మధ్య సంబంధాలు, సహకారంపై సమీక్షించారు.ప్రస్తుత ప్రాంతీయ భద్రతా సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  భద్రత, శాంతి మరియు న్యాయాన్ని నెలకొల్పడానికి అంతర్జాతీయ చట్టం నియమాలను అమలు చేయడానికి కట్టుబడి ఉండాలని ఇద్దరు మంత్రులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సౌదీ అరేబియా (KSA)లోని ఒమన్ రాయబారి హెచ్‌హెచ్ సయ్యద్ ఫైసల్ బిన్ టర్కీ అల్ సయీద్, GCC మరియు ప్రాంతీయ పొరుగు విభాగం అధిపతి షేక్ అహ్మద్ బిన్ హషీల్ అల్ మస్కారీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com