గాజా పై ఇజ్రాయెల్ బాంబుల దాడి.. 40 మంది మృతి
- September 10, 2024
గాజా: హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నది. దక్షిణ గాజా స్ట్రిప్పై జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డారు. గాజా పట్టీలోని ఖాన్ యునిస్, అల్-మవాసిలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పిడింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో దీనిని సురక్షితమైన జోన్ అని, ఎలాంటి దాడులు జరగబోవని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయినప్పటికీ దాడికి పాల్పడడం గమనార్హం. అయితే, హమాస్ కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడులు చేశామంటూ సైన్యం పేర్కొంది. గ్రాజా స్ట్రిప్లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు, సైన్యానికి వ్యతిరేంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందుకే దాడి చేస్తున్నట్లు పేర్కొంది.
కాగా, దాడి రాత్రిపూట దాడి జరిగిందని, 40 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. స్థానిక శిభిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, దీంతో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 15 మంది ఆచూకీలేకుండా పోయారని తెలిపారు. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..