గాజా పై ఇజ్రాయెల్ బాంబుల దాడి.. 40 మంది మృతి
- September 10, 2024
గాజా: హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నది. దక్షిణ గాజా స్ట్రిప్పై జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు గాయపడ్డారు. గాజా పట్టీలోని ఖాన్ యునిస్, అల్-మవాసిలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పిడింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో దీనిని సురక్షితమైన జోన్ అని, ఎలాంటి దాడులు జరగబోవని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయినప్పటికీ దాడికి పాల్పడడం గమనార్హం. అయితే, హమాస్ కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడులు చేశామంటూ సైన్యం పేర్కొంది. గ్రాజా స్ట్రిప్లోని ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ప్రాంతాలు, సైన్యానికి వ్యతిరేంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందుకే దాడి చేస్తున్నట్లు పేర్కొంది.
కాగా, దాడి రాత్రిపూట దాడి జరిగిందని, 40 మంది చనిపోగా 60 మంది గాయపడ్డారని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. స్థానిక శిభిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు దాడులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, దీంతో చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 15 మంది ఆచూకీలేకుండా పోయారని తెలిపారు. వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







