కేదార్నాథ్లో విరిగిపడ్డ కొండచరియలు.. 5కు చేరిన మృతుల సంఖ్య
- September 10, 2024
డెహ్రాడూన్: కేదార్నాథ్ మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య అయిదుగురికి చేరుకున్నది. ఇవాళ ఉదయం మరో నలుగురి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. శిథిలాల కింద ఇంకా అనేక మంది యాత్రికులు ఉంటారని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. కేదారీశ్వరుడిని దర్శనం చేసుకుని వెనక్కి వస్తున్న భక్తులు.. సోమవారం రాత్రి 7.30 నిమిషాలకు విరిగిపడ్డ కొండచరియల్లో చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. వెదర్ సరిగా లేకపోవడం వల్ల సోమవారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. రాత్రంతా అక్కడ రాళ్లు పడుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం పట్ల సీఎం పుష్కర్ సింగ్ థామీ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









