మాస్ రాజా హీరోయిన్ మలయాళ హీరోతో.!
- September 10, 2024
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. మాస్ రాజా రవితేజతో అమ్మడి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరహో అనిపించినా.. సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
అయినా భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం టాలీవుడ్లో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ వచ్చిందనుకోండి. తదుపరి బోలెడన్ని సినిమాలు అమ్మడి కోసం క్యూ కట్టేస్తాయనుకున్నారు.
అయితే, టాలీవుడ్ సంగతెలా వున్నా.. పాప మలయాళంలో ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. మలయాల హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమాకి రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కాంతా’ అనే టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమా లేటెస్ట్గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాని మలయాళంతో పాటూ, తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
దుల్కర్ సల్మాన్కి ఇప్పటికే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ వున్న సంగతి తెలిసిందే. సో, ఈ సినిమాతో ఇంకోసారి భాగ్యశ్రీ బోర్సే హాట్ టాపిక్ అయ్యింది. అలాగే, మరిన్ని సినిమాలు భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో పడే అవకాశముంది ప్రస్తుతం టాలీవుడ్లో వున్న పరిస్థితికి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









