మాస్ రాజా హీరోయిన్ మలయాళ హీరోతో.!
- September 10, 2024
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. మాస్ రాజా రవితేజతో అమ్మడి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరహో అనిపించినా.. సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
అయినా భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం టాలీవుడ్లో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ వచ్చిందనుకోండి. తదుపరి బోలెడన్ని సినిమాలు అమ్మడి కోసం క్యూ కట్టేస్తాయనుకున్నారు.
అయితే, టాలీవుడ్ సంగతెలా వున్నా.. పాప మలయాళంలో ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. మలయాల హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమాకి రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కాంతా’ అనే టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమా లేటెస్ట్గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాని మలయాళంతో పాటూ, తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
దుల్కర్ సల్మాన్కి ఇప్పటికే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ వున్న సంగతి తెలిసిందే. సో, ఈ సినిమాతో ఇంకోసారి భాగ్యశ్రీ బోర్సే హాట్ టాపిక్ అయ్యింది. అలాగే, మరిన్ని సినిమాలు భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో పడే అవకాశముంది ప్రస్తుతం టాలీవుడ్లో వున్న పరిస్థితికి.
తాజా వార్తలు
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి









