మాస్ రాజా హీరోయిన్ మలయాళ హీరోతో.!
- September 10, 2024
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. మాస్ రాజా రవితేజతో అమ్మడి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరహో అనిపించినా.. సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
అయినా భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం టాలీవుడ్లో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ వచ్చిందనుకోండి. తదుపరి బోలెడన్ని సినిమాలు అమ్మడి కోసం క్యూ కట్టేస్తాయనుకున్నారు.
అయితే, టాలీవుడ్ సంగతెలా వున్నా.. పాప మలయాళంలో ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. మలయాల హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమాకి రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కాంతా’ అనే టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమా లేటెస్ట్గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాని మలయాళంతో పాటూ, తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
దుల్కర్ సల్మాన్కి ఇప్పటికే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ వున్న సంగతి తెలిసిందే. సో, ఈ సినిమాతో ఇంకోసారి భాగ్యశ్రీ బోర్సే హాట్ టాపిక్ అయ్యింది. అలాగే, మరిన్ని సినిమాలు భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో పడే అవకాశముంది ప్రస్తుతం టాలీవుడ్లో వున్న పరిస్థితికి.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







