భారీ వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
- September 10, 2024
అమరావతి: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ పట్టణ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే, బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ ముంపు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో ప్రజల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చిచేరింది. మరోవైపు రోడ్లు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి. రహదారులు మొత్తం బురద మయం అయ్యాయి.దీంతో సీఎం చంద్రబాబు, రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యలు, బుడమేరు కాలువ గండ్లకు మరమ్మతు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. విజయవాడలో మంగళవారం సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అక్కడి ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఆ ప్రాంత అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75 లక్షల మందికి సహాయక చర్యలు అందించాలని సూచించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..