భారీ వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
- September 10, 2024
అమరావతి: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ పట్టణ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే, బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ ముంపు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో ప్రజల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చిచేరింది. మరోవైపు రోడ్లు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి. రహదారులు మొత్తం బురద మయం అయ్యాయి.దీంతో సీఎం చంద్రబాబు, రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యలు, బుడమేరు కాలువ గండ్లకు మరమ్మతు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. విజయవాడలో మంగళవారం సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అక్కడి ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఆ ప్రాంత అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75 లక్షల మందికి సహాయక చర్యలు అందించాలని సూచించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







