పార్కింగ్ వద్దే లగేజీ అప్పగింత.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొత్త సదుపాయం
- September 10, 2024
హైదరాబాద్: శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు 'సిటీ సైడ్ చెక్-ఇన్ అండ్ బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ' పేరిట కొత్త సదుపాయాన్ని ఎయిరిండియా అందుబాటులోకి తెచ్చింది.
ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని 'డిపార్చర్ లెవల్' వరకు తీసుకువెళ్లే అవసరం లేకుండా, వాహనాల పార్కింగ్ - బస్టాండుకు సమీపంలో, గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న కౌంటర్లోనే అప్పగించే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానం బయలుదేరడానికి 6 గంటల ముందు నుంచి, 90 నిమిషాల ముందు వరకు ఇక్కడ ప్రయాణికుల చెక్ ఇన్ బ్యాగులు తీసుకుంటారు. బ్యాగులు కిందే ఇచ్చేయడం వల్ల ప్రయాణికులకు చెక్-ఇన్ ప్రక్రియ సులువవుతుందని, సమయం ఆదా అవుతుందని పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ (ఎస్బీడీ) మెషీన్లను ఎయిరిండియా ఏర్పాటు చేసింది. దీనివల్ల బ్యాగేజీ అప్పగింత సమయం కూడా ఆదా అవుతుంది.

తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







