పార్కింగ్ వద్దే లగేజీ అప్పగింత.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొత్త సదుపాయం
- September 10, 2024
హైదరాబాద్: శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు 'సిటీ సైడ్ చెక్-ఇన్ అండ్ బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ' పేరిట కొత్త సదుపాయాన్ని ఎయిరిండియా అందుబాటులోకి తెచ్చింది.
ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని 'డిపార్చర్ లెవల్' వరకు తీసుకువెళ్లే అవసరం లేకుండా, వాహనాల పార్కింగ్ - బస్టాండుకు సమీపంలో, గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న కౌంటర్లోనే అప్పగించే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానం బయలుదేరడానికి 6 గంటల ముందు నుంచి, 90 నిమిషాల ముందు వరకు ఇక్కడ ప్రయాణికుల చెక్ ఇన్ బ్యాగులు తీసుకుంటారు. బ్యాగులు కిందే ఇచ్చేయడం వల్ల ప్రయాణికులకు చెక్-ఇన్ ప్రక్రియ సులువవుతుందని, సమయం ఆదా అవుతుందని పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ (ఎస్బీడీ) మెషీన్లను ఎయిరిండియా ఏర్పాటు చేసింది. దీనివల్ల బ్యాగేజీ అప్పగింత సమయం కూడా ఆదా అవుతుంది.

తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







