పార్కింగ్ వద్దే లగేజీ అప్పగింత.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొత్త సదుపాయం
- September 10, 2024
హైదరాబాద్: శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు 'సిటీ సైడ్ చెక్-ఇన్ అండ్ బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ' పేరిట కొత్త సదుపాయాన్ని ఎయిరిండియా అందుబాటులోకి తెచ్చింది.
ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని 'డిపార్చర్ లెవల్' వరకు తీసుకువెళ్లే అవసరం లేకుండా, వాహనాల పార్కింగ్ - బస్టాండుకు సమీపంలో, గ్రౌండ్ఫ్లోర్లో ఉన్న కౌంటర్లోనే అప్పగించే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానం బయలుదేరడానికి 6 గంటల ముందు నుంచి, 90 నిమిషాల ముందు వరకు ఇక్కడ ప్రయాణికుల చెక్ ఇన్ బ్యాగులు తీసుకుంటారు. బ్యాగులు కిందే ఇచ్చేయడం వల్ల ప్రయాణికులకు చెక్-ఇన్ ప్రక్రియ సులువవుతుందని, సమయం ఆదా అవుతుందని పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ (ఎస్బీడీ) మెషీన్లను ఎయిరిండియా ఏర్పాటు చేసింది. దీనివల్ల బ్యాగేజీ అప్పగింత సమయం కూడా ఆదా అవుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..