మరో 10 వందే భారత్ రైళ్లు లాంచ్..
- September 13, 2024
న్యూ ఢిల్లీ: భారత్ లో మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు వందే భారత్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది.
ఈనెలలోనే మరో 10 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
రాబోయే రైళ్లు టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా), రూర్కెలా-హౌరా, హౌరా-గయా, ఆగ్రా-వారణాసితో సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరింపజేయనున్నాయి. రైల్వే వ్యవస్థను ఆధునీకరించే భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఈ రైళ్లు హై-స్పీడ్ సామర్థ్యాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా అధునాతన సౌకర్యాలు ఏర్పటు చేశారు. ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇటీవలే ప్రధాని మోడీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మీరట్ నుంచి లక్నో, మధురై నుంచి బెంగళూరు, చెన్నై నుంచి నాగర్కోయిల్లను కలుపుతూ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









