బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్‌పూర్‌లో యోగా దినోత్సవo

- June 19, 2016 , by Maagulf
బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్‌పూర్‌లో యోగా దినోత్సవo

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్‌పూర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. బోర్డర్‌ సెక్యూరిటి ఫోర్స్‌ శిబిరం వద్ద దాదాపు 3వేల మందితో వేకువ జామున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాజస్థాన్‌ రాష్ట్రం వెంట భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బీఎస్‌ఎఫ్‌ శిబిరాన్ని జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీలతో పాటు ఎస్‌ఎస్‌బీలకు చెందిన దాదాపు 30వేల మంది భద్రతా సిబ్బంది దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com