రంజాన్‌ తోఫా పథకం అమలు ..

- June 19, 2016 , by Maagulf
రంజాన్‌ తోఫా పథకం అమలు ..

నగరంలోని పౌరసరఫరాలశాఖ గిగ్డంగులను ఆదివారం ఏపీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జూలై 1 నుంచి చంద్రన్న రంజాన్‌ తోఫా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల మందికి రంజాన్‌ తోఫా సరకులు పంపీణి చేస్తామని తెలిపారు. సాంకేతిక విధానాలతో పౌరసరఫరాలశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేశామని, త్వరలో జనాభాకు తగ్గట్టుగా డీలర్లను పెంచే యోచన ఉందని వెల్లడించారు. సబ్‌కమిటీ నిర్ణయం తర్వాత డీలర్ల కమిషన్‌ పెంపు ఉంటుందన్నారు. సర్వే తర్వాత అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com