సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలకు విరామం..!!
- September 14, 2024
దుబాయ్: ప్రవక్త ముహమ్మద్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలు అందుబాటులో ఉండవని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) ప్రకటించింది. తమ వీసా స్థితిని క్రమబద్ధీకరించుకోవాలనుకునే లేదా దేశం నుండి వెళ్లాలనుకునేవారు తుది గడువు కంటే ముందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్ అవీర్లోని స్టేటస్ రెగ్యులరైజేషన్ సెంటర్లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారాల్లో ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. యూఏఈలో వీసా క్షమాభిక్ష పథకం సెప్టెంబర్ 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది అక్రమ ప్రవాసులు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఎమిరేట్స్ విడిచి వెళ్లారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









