సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలకు విరామం..!!
- September 14, 2024
దుబాయ్: ప్రవక్త ముహమ్మద్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలు అందుబాటులో ఉండవని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) ప్రకటించింది. తమ వీసా స్థితిని క్రమబద్ధీకరించుకోవాలనుకునే లేదా దేశం నుండి వెళ్లాలనుకునేవారు తుది గడువు కంటే ముందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్ అవీర్లోని స్టేటస్ రెగ్యులరైజేషన్ సెంటర్లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారాల్లో ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. యూఏఈలో వీసా క్షమాభిక్ష పథకం సెప్టెంబర్ 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది అక్రమ ప్రవాసులు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఎమిరేట్స్ విడిచి వెళ్లారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







