BD18,000 చెల్లించండి.. స్టేషనరీ స్టోరుకు కమర్షియల్ కోర్టు ఆదేశం..!!
- September 14, 2024
మానామా: తగినంత నిధులు లేకుండానే చెక్కులు ఇచ్చి మోసం చేసినందుకు వాణిజ్య సంస్థకు BD18,000 తిరిగి చెల్లించాలని కమర్షియల్ కోర్టు ఒక స్టేషనరీ దుకాణాన్ని ఆదేశించింది. స్టేషనరీ దుకాణానికి BD18,000 విలువైన వస్తువులను సరఫరా చేసిన వాణిజ్య సంస్థకు సదరు స్టేషనరీ దుకాణం చెక్కులను అందజేసింది. కానీ అవి నిధులు లేక బౌన్స్ అయ్యాయి. కంపెనీ సంప్రదించిన రెస్పాన్స్ లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. చెక్కుల చెల్లింపు గడువు ముగిసిందని గుర్తించిన కోర్టు.. కమర్షియల్ కోడ్ ఆర్టికల్ 81/1 ప్రకారం.. ప్రతి చెక్కు మెచ్యూరిటీ తేదీ నుండి సంవత్సరానికి 4% చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. చట్టపరమైన వడ్డీతో BD18,000 చెల్లించాలని స్టేషనరీ దుకాణం యజమానిని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఫీజు, లీగల్ ఫీజు కోసం BD50 చెల్లించాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి







