BD18,000 చెల్లించండి.. స్టేషనరీ స్టోరుకు కమర్షియల్ కోర్టు ఆదేశం..!!
- September 14, 2024
మానామా: తగినంత నిధులు లేకుండానే చెక్కులు ఇచ్చి మోసం చేసినందుకు వాణిజ్య సంస్థకు BD18,000 తిరిగి చెల్లించాలని కమర్షియల్ కోర్టు ఒక స్టేషనరీ దుకాణాన్ని ఆదేశించింది. స్టేషనరీ దుకాణానికి BD18,000 విలువైన వస్తువులను సరఫరా చేసిన వాణిజ్య సంస్థకు సదరు స్టేషనరీ దుకాణం చెక్కులను అందజేసింది. కానీ అవి నిధులు లేక బౌన్స్ అయ్యాయి. కంపెనీ సంప్రదించిన రెస్పాన్స్ లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. చెక్కుల చెల్లింపు గడువు ముగిసిందని గుర్తించిన కోర్టు.. కమర్షియల్ కోడ్ ఆర్టికల్ 81/1 ప్రకారం.. ప్రతి చెక్కు మెచ్యూరిటీ తేదీ నుండి సంవత్సరానికి 4% చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. చట్టపరమైన వడ్డీతో BD18,000 చెల్లించాలని స్టేషనరీ దుకాణం యజమానిని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఫీజు, లీగల్ ఫీజు కోసం BD50 చెల్లించాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







