BD18,000 చెల్లించండి.. స్టేషనరీ స్టోరుకు కమర్షియల్ కోర్టు ఆదేశం..!!
- September 14, 2024
మానామా: తగినంత నిధులు లేకుండానే చెక్కులు ఇచ్చి మోసం చేసినందుకు వాణిజ్య సంస్థకు BD18,000 తిరిగి చెల్లించాలని కమర్షియల్ కోర్టు ఒక స్టేషనరీ దుకాణాన్ని ఆదేశించింది. స్టేషనరీ దుకాణానికి BD18,000 విలువైన వస్తువులను సరఫరా చేసిన వాణిజ్య సంస్థకు సదరు స్టేషనరీ దుకాణం చెక్కులను అందజేసింది. కానీ అవి నిధులు లేక బౌన్స్ అయ్యాయి. కంపెనీ సంప్రదించిన రెస్పాన్స్ లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. చెక్కుల చెల్లింపు గడువు ముగిసిందని గుర్తించిన కోర్టు.. కమర్షియల్ కోడ్ ఆర్టికల్ 81/1 ప్రకారం.. ప్రతి చెక్కు మెచ్యూరిటీ తేదీ నుండి సంవత్సరానికి 4% చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. చట్టపరమైన వడ్డీతో BD18,000 చెల్లించాలని స్టేషనరీ దుకాణం యజమానిని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఫీజు, లీగల్ ఫీజు కోసం BD50 చెల్లించాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









