కువైట్ లో స్కూల్స్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు..!
- September 16, 2024
కువైట్: 500,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు, 105,000 మంది టీచర్లు, సిబ్బంది తిరిగే స్కూళ్లకు హాజరు కానున్నారు. ఈ మేరకు సన్నాహాలను పూర్తి చేసినట్టు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అకడమిక్ క్యాలెండర్ ఆధారంగా అరబిక్ పాఠశాలల్లో మొదటి గ్రేడ్ సెప్టెంబర్ 16న ప్రారంభమవుతుంది. అయితే ప్రాథమిక, మధ్య మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులు సెప్టెంబర్ 17న, కిండర్ గార్టెన్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్నాయి. GPS ట్రాకింగ్ సిస్టమ్లతో కూడిన పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా విద్య మరియు అంతర్గత మంత్రిత్వ శాఖలు 2024-25 విద్యా సంవత్సరానికి ముందు రహదారి-అవగాహన మీడియా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం సెంటర్ ఫర్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ (CGC), సమాచార మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. రహదారులపై రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









