కువైట్ లో స్కూల్స్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు..!
- September 16, 2024
కువైట్: 500,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు, 105,000 మంది టీచర్లు, సిబ్బంది తిరిగే స్కూళ్లకు హాజరు కానున్నారు. ఈ మేరకు సన్నాహాలను పూర్తి చేసినట్టు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అకడమిక్ క్యాలెండర్ ఆధారంగా అరబిక్ పాఠశాలల్లో మొదటి గ్రేడ్ సెప్టెంబర్ 16న ప్రారంభమవుతుంది. అయితే ప్రాథమిక, మధ్య మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులు సెప్టెంబర్ 17న, కిండర్ గార్టెన్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్నాయి. GPS ట్రాకింగ్ సిస్టమ్లతో కూడిన పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా విద్య మరియు అంతర్గత మంత్రిత్వ శాఖలు 2024-25 విద్యా సంవత్సరానికి ముందు రహదారి-అవగాహన మీడియా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం సెంటర్ ఫర్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ (CGC), సమాచార మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్నారు. రహదారులపై రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







