ఈద్ కానుకలు..

- June 19, 2016 , by Maagulf
ఈద్ కానుకలు..

రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాల్లో పండుగ రోజు కొత్త బట్టలు ధరించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కుటుంబాలకు బట్టల కానుకలు పంపిణీ చేయనుంది. ప్రతి ప్యాకేట్‌లో కుర్తా పైజామా, చీర.. జాకెట్, షేట్, షేల్వర్, చున్ని అందిస్తున్నారు. ఈ మొత్తం ప్యాకెట్ విలువ రూ.395గా ఉంది. ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఈద్ కానుకలు అందజేయనున్నారు.జిల్లాల్లో ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో జిల్లా కలెక్టర్‌ల పర్యవేక్షలో పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన ప్రదేశాల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ పర్యవేక్షలో పంపిణీ చేస్తారు.ప్రభుత్వం కానుకల పంపిణీ కోసం తేదీ ప్రకటించ లేదు. ప్రటించిన అనంతరం పంపిణీ షురూ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com