అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి..

- June 19, 2016 , by Maagulf
అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి..

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో సోమవారం ఉదయం ఓ మినీ బస్సులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర సర్వీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు బస్సులో కార్యాలయాలకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసు అధికారులు తెలిపారు.మృతులను ఇంకా గుర్తించలేదు. రంజాన్‌ మాసంలో ఈ ఘోరం చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాలిబన్‌ నేత ముల్లా అక్తర్‌ మన్సూర్‌ మృతికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com