భారత్ వ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
- September 17, 2024
దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు మరోసారి నిలిచిపోయాయి. సెప్టెంబర్ 17 మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై నుండి ఈ అంతరాయం ప్రారంభమై..
దేశంలోని అన్ని నగరాల్లో Jio డౌన్ అయింది. అంతకుముందు మే, జూన్ 2024లో కూడా ముంబైలో జియో సేవలు నిలిచిపోయాయి. జియో డౌన్ కావడంపై వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎటువంటి ఖచ్చితమైన పరిష్కారం, హామీ రాలేదు.
ముంబై అంతటా జియో సేవలు నిలిచిపోయాయని సోషల్ మీడియాలో వినియోగదారులు పేర్కొంటున్నారు. కొన్ని గంటలుగా నెట్వర్క్ సమస్య ఉందని వెల్లడించారు. చాలా మంది వినియోగదారులు బ్రాడ్బ్యాండ్ సేవలపై కూడా ఫిర్యాదు చేశారు. అంతరాయాన్ని ట్రాక్ చేసే డౌన్డెటెక్టర్ కూడా Jio అంతరాయాన్ని ధృవీకరించింది. డౌన్డెటెక్టర్ మ్యాప్ ప్రకారం.. న్యూఢిల్లీ, లక్నో, నాగ్పూర్, కటక్, హైదరాబాద్, చెన్నై, పాట్నా, అహ్మదాబాద్, కోల్కతా, గౌహతి వంటి నగరాల్లో Jio సేవలు నిలిచిపోయాయి.
కేవలం 1 గంటలో 10 వేల మందికి పైగా డౌన్డెటెక్టర్పై ఫిర్యాదులు చేశారు. సిగ్నల్ లేదని 67 శాతం మంది, మొబైల్ ఇంటర్నెట్పై 20 శాతం మంది, జియో ఫైబర్పై 14 శాతం మంది ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







