భారత్ వ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
- September 17, 2024
దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు మరోసారి నిలిచిపోయాయి. సెప్టెంబర్ 17 మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై నుండి ఈ అంతరాయం ప్రారంభమై..
దేశంలోని అన్ని నగరాల్లో Jio డౌన్ అయింది. అంతకుముందు మే, జూన్ 2024లో కూడా ముంబైలో జియో సేవలు నిలిచిపోయాయి. జియో డౌన్ కావడంపై వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎటువంటి ఖచ్చితమైన పరిష్కారం, హామీ రాలేదు.
ముంబై అంతటా జియో సేవలు నిలిచిపోయాయని సోషల్ మీడియాలో వినియోగదారులు పేర్కొంటున్నారు. కొన్ని గంటలుగా నెట్వర్క్ సమస్య ఉందని వెల్లడించారు. చాలా మంది వినియోగదారులు బ్రాడ్బ్యాండ్ సేవలపై కూడా ఫిర్యాదు చేశారు. అంతరాయాన్ని ట్రాక్ చేసే డౌన్డెటెక్టర్ కూడా Jio అంతరాయాన్ని ధృవీకరించింది. డౌన్డెటెక్టర్ మ్యాప్ ప్రకారం.. న్యూఢిల్లీ, లక్నో, నాగ్పూర్, కటక్, హైదరాబాద్, చెన్నై, పాట్నా, అహ్మదాబాద్, కోల్కతా, గౌహతి వంటి నగరాల్లో Jio సేవలు నిలిచిపోయాయి.
కేవలం 1 గంటలో 10 వేల మందికి పైగా డౌన్డెటెక్టర్పై ఫిర్యాదులు చేశారు. సిగ్నల్ లేదని 67 శాతం మంది, మొబైల్ ఇంటర్నెట్పై 20 శాతం మంది, జియో ఫైబర్పై 14 శాతం మంది ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







