భారత్ వ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
- September 17, 2024
దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు మరోసారి నిలిచిపోయాయి. సెప్టెంబర్ 17 మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబై నుండి ఈ అంతరాయం ప్రారంభమై..
దేశంలోని అన్ని నగరాల్లో Jio డౌన్ అయింది. అంతకుముందు మే, జూన్ 2024లో కూడా ముంబైలో జియో సేవలు నిలిచిపోయాయి. జియో డౌన్ కావడంపై వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎటువంటి ఖచ్చితమైన పరిష్కారం, హామీ రాలేదు.
ముంబై అంతటా జియో సేవలు నిలిచిపోయాయని సోషల్ మీడియాలో వినియోగదారులు పేర్కొంటున్నారు. కొన్ని గంటలుగా నెట్వర్క్ సమస్య ఉందని వెల్లడించారు. చాలా మంది వినియోగదారులు బ్రాడ్బ్యాండ్ సేవలపై కూడా ఫిర్యాదు చేశారు. అంతరాయాన్ని ట్రాక్ చేసే డౌన్డెటెక్టర్ కూడా Jio అంతరాయాన్ని ధృవీకరించింది. డౌన్డెటెక్టర్ మ్యాప్ ప్రకారం.. న్యూఢిల్లీ, లక్నో, నాగ్పూర్, కటక్, హైదరాబాద్, చెన్నై, పాట్నా, అహ్మదాబాద్, కోల్కతా, గౌహతి వంటి నగరాల్లో Jio సేవలు నిలిచిపోయాయి.
కేవలం 1 గంటలో 10 వేల మందికి పైగా డౌన్డెటెక్టర్పై ఫిర్యాదులు చేశారు. సిగ్నల్ లేదని 67 శాతం మంది, మొబైల్ ఇంటర్నెట్పై 20 శాతం మంది, జియో ఫైబర్పై 14 శాతం మంది ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







