ఈ రమదాన్ కాలంలో ఇప్పటివరకు 8 మంది ట్రాఫిక్ ప్రమాదాలలో మరణించారు
- June 20, 2016
ఈ నెల జూన్ 6 న రమదాన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ట్రాఫిక్ సంఘటనలలో ఎనిమిది మంది మరణించారు అలాగే 12 మంది గాయపడినట్లు దుబాయ్ పోలీస్ ఆదివారం తెలిపింది. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజిఒర్ మాట్లాడుతూ ఈ నెల జూన్ 6 వ తేది నుంచి 16 వ తేది మధ్య కాలంలో 26 ట్రాఫిక్ సంఘటనలు జరగగా ఇందులో 40 వాహనాల జోక్యం ఉందని తెలిపారు.మొత్తం 12 మంది ఈ ప్రమాదాలలో గాయపడగా, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి ఉండగా మరో ఆరుగురు ఒక మోస్తరుగా గాయాల పాలయ్యారు. మరో ఐదుగురు చిన్న గాయాలతో బయటపడ్డారు.26 ప్రమాదాలలో 17 కేసులలో వాహనాలు ఎదురెదురుగా దూసుకెళ్ళడం ఉన్నాయి, మరో ఐదుగురు ప్రమాదాలలో వాహనాలు మీద నుండి వెళ్ళడం వలన ప్రమాదాలు జరగ్గా , మరియు నాలుగు ప్రమాదాలు వాహనాన్ని అతిగా మలుపు తిప్పడం వలన ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు.
గత రామదన్ సమయంలో, దుబాయ్ పోలీసులు నమోదు చేసిన ప్రమాద వివరాల ప్రకారం మొత్తం 201 తీవ్రమైన ప్రమాదాలు కాగా, ఇందులో 10 మంది మరణించగా మరియు 147 మంది గాయాల పాలయ్యారు. గాయపడిన 146 మందిలో 19 మందికి తీవ్రమైన గాయాలపాలయ్యారు. 35 మందికి ఒక మోస్తరుగా గాయాలు తగిలాయి. మిగిలిన 93 మందిగా స్వల్ప గాయాలు తగిలినట్లు వివరించారు. ఉన్నాయి. ప్రమాదాలను నివారించడానికి ప్రజలు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు కట్టుబడి ఉండాలని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజిఒర్ కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







