నిధుల దుర్వినియోగం

- June 20, 2016 , by Maagulf
నిధుల దుర్వినియోగం

పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విచారణలో, రెలిజియస్‌ క్లరిక్‌ షేక్‌ ఇసా కాసిమ్‌, పెద్ద మొత్తంలో నిధుల్ని దారి మళ్ళించారనీ, ఇందులో చాలావరకు బహ్రెయిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇరాన్‌, ఇరాక్‌లోని సంస్థలకు పంపించారనీ తేలింది. అల్‌ వెఫాక్‌ ఇస్లామిక్‌ సొసైటీ స్పిరిట్యువల్‌ లీడర్‌ అయిన షేక్‌ ఇసా కాసిమ్‌, విరాళాల సేకరణకు సంబంధించిన చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. షేక్‌ ఇసా కాసిమ్‌, 10 మిలియన్‌ దిర్హామ్‌లు తన అక్కౌంట్‌లో కలిగి ఉన్నారు. విరాళాల రూపంలో వచ్చే సొమ్ముల్ని సంస్థకు మళ్ళించకుండా వాటిని, అసాంఘీక కార్యక్రమాల కోసం షేక్‌ ఇసా కాసిమ్‌ వినియోగించినట్లు తేల్చింది పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌. ఇస్లామిక్‌ అవేర్‌నెస్‌ సొసైటీ ద్వారా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనీ, మనీ ల్యాండరింగ్‌ కూడ ఇక్కడ జరిగిందని, విచారణ ఇంకా కొనసాగుతోందని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మొహమ్మద్‌ అల్‌ మలికి చెప్పారు. అక్రమాలకు పాల్పడేందుకోసం లైసెన్స్‌ లేని కార్యాలయాన్ని కూడా తెరిచి, వాటి ద్వారా డబ్బుని ఇతరులకు పంపించి, బహ్రెయిన్‌ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని విచారణలో తేలింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com