ఎమ్మెల్యే ఆదిమూలం పై కేసు ఉత్తిదే: సీనియర్ న్యాయవాది రఘు
- September 21, 2024
విజయవాడ: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై నమోదైన అత్యాచారం కేసుపై శుక్రవారం హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం పై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా కోర్టుకు వెళ్లి, అతని పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్ లో చెప్పిన అంశాలు అవాస్తవమంటూ అఫిడవిట్ ను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. న్యాయస్థానం కూడా బాధిత మహిళతో మాట్లాడడం జరిగింది.అనంతరం వాస్తవాలను వివరిస్తూ అఫీడవిట్ వేశానని, ఆదిమూలం పై నమోదు చేసిన కేసు తప్పు అంటూ, దానిని కొట్టేయమని న్యాయమూర్తిని వేడుకుంది.ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలం పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తగిన ఉత్తర్వులు జారీ చేసే నిమిత్తం విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కె కృపాసాగర్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలంపై తిరుపతి తూర్పు టానా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.శుక్రవారం రోజు జరిగిన విచారణలో ఆదిమూలం తరపు సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు తన వాదనను వినిపిస్తూ పోలీసులు విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని చెప్పారు. మూడో వ్యక్తి చొరవతో పిటిషనర్ పై ఆ మహిళా ఫిర్యాదు చేశారని అన్నాడు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









