ఎమ్మెల్యే ఆదిమూలం పై కేసు ఉత్తిదే: సీనియర్ న్యాయవాది రఘు
- September 21, 2024
విజయవాడ: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై నమోదైన అత్యాచారం కేసుపై శుక్రవారం హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం పై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా కోర్టుకు వెళ్లి, అతని పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్ లో చెప్పిన అంశాలు అవాస్తవమంటూ అఫిడవిట్ ను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. న్యాయస్థానం కూడా బాధిత మహిళతో మాట్లాడడం జరిగింది.అనంతరం వాస్తవాలను వివరిస్తూ అఫీడవిట్ వేశానని, ఆదిమూలం పై నమోదు చేసిన కేసు తప్పు అంటూ, దానిని కొట్టేయమని న్యాయమూర్తిని వేడుకుంది.ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలం పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తగిన ఉత్తర్వులు జారీ చేసే నిమిత్తం విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కె కృపాసాగర్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలంపై తిరుపతి తూర్పు టానా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.శుక్రవారం రోజు జరిగిన విచారణలో ఆదిమూలం తరపు సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు తన వాదనను వినిపిస్తూ పోలీసులు విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని చెప్పారు. మూడో వ్యక్తి చొరవతో పిటిషనర్ పై ఆ మహిళా ఫిర్యాదు చేశారని అన్నాడు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!