శర్వా కొత్త ప్రాజెక్ట్.! ఈ సారి ప్యాన్ ఇండియా టార్గెట్.!
- September 21, 2024
సంపత్ నంది డైరెక్షన్లో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన లైనప్ సంపత్ నంది ముందే వెల్లడించేశారు.
1960 బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంపత్ నంది ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు.
యూనిక్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. శర్వా 38వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా శర్వా కెరీర్లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీగా పరిగణించొచ్చు.
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ఫెయిల్యూర్ చవి చూసిన శర్వా ఈ సినిమా కోసం రెట్రో లుక్స్తో మేకోవర్ కానున్నాడట. హీరోయిన్ తదితర వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..