శర్వా కొత్త ప్రాజెక్ట్.! ఈ సారి ప్యాన్ ఇండియా టార్గెట్.!
- September 21, 2024
సంపత్ నంది డైరెక్షన్లో శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన లైనప్ సంపత్ నంది ముందే వెల్లడించేశారు.
1960 బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంపత్ నంది ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు.
యూనిక్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. శర్వా 38వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా శర్వా కెరీర్లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీగా పరిగణించొచ్చు.
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ఫెయిల్యూర్ చవి చూసిన శర్వా ఈ సినిమా కోసం రెట్రో లుక్స్తో మేకోవర్ కానున్నాడట. హీరోయిన్ తదితర వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







