ఇరాన్ బొగ్గు గనిలో భారీ పేలుడు
- September 22, 2024
ఇరాన్: ఇరాన్ లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో లోపల పనిచేస్తున్న కార్మికులలో 30 మంది చనిపోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు.. గాయపడ్డ కార్మికులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బొగ్గు గని టన్నెల్ లో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని సమాచారం. మీథేన్ గ్యాస్ లీక్ కావడమే పేలుడుకు దారి తీసిందని గాయపడ్డ కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
మరికొంత మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారని అనుమానం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, లోపల చిక్కుకున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన బొగ్గు గని ఇరాన్ రాజధానికి సుమారు 540 కిలోమీటర్ల దూరంలోని తబాస్ లో ఉంది. కాగా, ఇరాన్ లో గతంలోనూ బొగ్గు గని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2017లో ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడుకు 42 మంది కార్మికులు బలయ్యారు. 2013లో రెండు గనులలో జరిగిన ప్రమాదాలలో 11 మంది, 2009లో జరిగిన మరో ప్రమాదంలో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









