ఒమన్ సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ.. 60% నిర్మాణం పూర్తి..!!
- September 22, 2024
మస్కట్: మస్కట్లోని సీబ్లో నిర్మిస్తున్న సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ పనులు 60% పూర్తయినట్టు, 2025 చివర దీనిని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. 18,155 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సదుపాయం 18.2 మిలియన్ ఒమానీ రియాల్స్ అంచనా వ్యయంతో నిర్మించబడుతోంది. ప్రయోగశాల పరీక్షల కోసం అత్యాధునిక సాంకేతికతలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ హనన్ బింట్ సలేం అల్ కిండి తెలిపారు. మొత్తం మూడు అంతస్తులు ఉంటాయన్నారు. మొదటి అంతస్తులో హౌసింగ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, 130 మంది వ్యక్తుల లెక్చర్ హాల్, నమూనా రిసెప్షన్ వింగ్ ఉన్నాయి. వైరాలజీ, బ్యాక్టీరియాలజీ టాక్సికాలజీ వంటి వివిధ రంగాలకు సంబంధించి 2వ అంతస్తులో ప్రయోగశాలలను కేటాయించారు. ఇక చివరి అంతస్తులో సూక్ష్మజీవులపై ప్రయోగాలకు ప్రత్యేక ల్యాబ్ లను నిర్మిస్తున్నారు. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ఒమన్లో ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని, ప్రజారోగ్య సహకారంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







