ఒమన్ సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ.. 60% నిర్మాణం పూర్తి..!!
- September 22, 2024
మస్కట్: మస్కట్లోని సీబ్లో నిర్మిస్తున్న సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ పనులు 60% పూర్తయినట్టు, 2025 చివర దీనిని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. 18,155 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సదుపాయం 18.2 మిలియన్ ఒమానీ రియాల్స్ అంచనా వ్యయంతో నిర్మించబడుతోంది. ప్రయోగశాల పరీక్షల కోసం అత్యాధునిక సాంకేతికతలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ హనన్ బింట్ సలేం అల్ కిండి తెలిపారు. మొత్తం మూడు అంతస్తులు ఉంటాయన్నారు. మొదటి అంతస్తులో హౌసింగ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, 130 మంది వ్యక్తుల లెక్చర్ హాల్, నమూనా రిసెప్షన్ వింగ్ ఉన్నాయి. వైరాలజీ, బ్యాక్టీరియాలజీ టాక్సికాలజీ వంటి వివిధ రంగాలకు సంబంధించి 2వ అంతస్తులో ప్రయోగశాలలను కేటాయించారు. ఇక చివరి అంతస్తులో సూక్ష్మజీవులపై ప్రయోగాలకు ప్రత్యేక ల్యాబ్ లను నిర్మిస్తున్నారు. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ఒమన్లో ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని, ప్రజారోగ్య సహకారంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







