ఖతార్కు రికార్డు స్థాయిలో పర్యాటకులు.. 8 నెలల్లో 3.3 మిలియన్ల విజిటర్స్..!!
- September 22, 2024
దోహా: ఖతార్ 2024 సంవత్సరం అత్యధిక పర్యాటకుల సంఖ్యను నమోదు చేయనుంది. ఇప్పటికే గత 8 నెలల్లో దాదాపు 3.3 మిలియన్ల మంది విజిటర్స్ వచ్చారు. గత సంవత్సరం, ఖతార్ నాలుగు మిలియన్లకు పైగా సందర్శకులను స్వాగతించింది. ఇప్పటివరకు ఇది అత్యధిక సంఖ్యగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం.. 2024లో ఇప్పటివరకు 3.284 మిలియన్ల మంది దేశాన్ని సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం పెరగడం విశేషం. 2024లో 4.5 మిలియన్లు, 2025 నాటికి 4.9 మిలియన్లకు విజిటర్స్ సంఖ్య పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాది పొడవునా అనేక పర్యాటక ఆఫర్ల కారణంగా ఖతార్కు రికార్డు సంఖ్యలో పర్యాటకులు వస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







