దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్
- September 24, 2024
భారత్: దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారత్ లో మరోసారి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. గత కొన్ని రోజులుగా మంకీపాక్స్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే గత ఐదేళ్ల కిందట కరోనా కేసులు కూడా ఇలాగే ఒకటి, రెండు, మూడు పెరుగుతూ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది.
కాంగో సహ పలు దేశాలను కలవరపెడుతోంది ఈ మంకీపాక్స్. తాజాగా భారత్ లోనూ వ్యాప్తి చెందింది. భారతదేశంలో మంకీపాక్స్ కేసు మరొకటి నమోదయింది. మూడో మంకీపాక్స్ కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా వెలువడలేదు. రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారతదేశానికి రావడం జరిగింది. అతడు కేరళ వాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది. విచారణ నివేదికలో బాధితుడికి మంకీపాక్స్ కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్టుగా తెలిసింది.
ఇటీవల కేరళలోని మలప్పురంలో రెండవ కేసు బయటకు వచ్చింది. ఆ వ్యక్తి కూడా యూఏఈ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినట్లుగా సమాచారం. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని పరీక్షించి మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు వెళ్లడైంది. విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!