దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్
- September 24, 2024
భారత్: దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారత్ లో మరోసారి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. గత కొన్ని రోజులుగా మంకీపాక్స్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే గత ఐదేళ్ల కిందట కరోనా కేసులు కూడా ఇలాగే ఒకటి, రెండు, మూడు పెరుగుతూ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది.
కాంగో సహ పలు దేశాలను కలవరపెడుతోంది ఈ మంకీపాక్స్. తాజాగా భారత్ లోనూ వ్యాప్తి చెందింది. భారతదేశంలో మంకీపాక్స్ కేసు మరొకటి నమోదయింది. మూడో మంకీపాక్స్ కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా వెలువడలేదు. రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారతదేశానికి రావడం జరిగింది. అతడు కేరళ వాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది. విచారణ నివేదికలో బాధితుడికి మంకీపాక్స్ కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్టుగా తెలిసింది.
ఇటీవల కేరళలోని మలప్పురంలో రెండవ కేసు బయటకు వచ్చింది. ఆ వ్యక్తి కూడా యూఏఈ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినట్లుగా సమాచారం. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని పరీక్షించి మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు వెళ్లడైంది. విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









