అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- September 26, 2024
రష్యాపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. రష్యాలోని మందుగుండు సామగ్రి డిపోపై ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. దీంతో రష్యా మరింత అప్రమత్తమైంది. అంతేగాక, రష్యాపై ఉక్రెయిన్ నుంచి క్షిపణులతో దాడి జరగొచ్చంటూ తమ దేశ నిఘావర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ అత్యున్నత భద్రతా కౌన్సిల్ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పశ్చిమ దేశాలకు ‘న్యూక్లియర్ వార్నింగ్’ ఇచ్చారు. రష్యాపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్కు అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు అనుమతిస్తే తాము అణ్వాయుధాలతో దాడి చేస్తామని పుతిన్ హెచ్చరించారు. యూకేకు చెందిన స్టార్మ్ షాడో క్రూయిజ్ క్షిపణిని రష్యాపై దాడి చేయడానికి వాడేలా యూకే గతవారం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలవడానికి వాషింగ్టన్ డీసీకి కూడా వెళ్లారు. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ నుంచి ఆయుధాలతో దాడి చేయడంపై కైర్ స్టార్మర్, జో బైడెన్ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఇటీవల రష్యా నిఘా శాఖ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో యుద్ధం వేళ పశ్చిమ దేశాల జోక్యం మరింత పెరగడంతో తమ దేశ అణ్వాయుధ నియమ నిబంధనలను సవరించడం తప్పనిసరి అవుతోందని చెప్పింది.
తమ దేశ భూభాగంపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్కు అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు అనుమతివ్వనున్నట్లు వస్తున్న ప్రచారంపై పుతిన్ స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్కు ఇటువంటి అనుమతులను ఇస్తే పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధం చేస్తున్నట్లే. అటువంటిదే జరిగితే మేము అందుకు తగ్గ నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో 88 శాతం రష్యా, అమెరికా వద్దే ఉన్నాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..