వదిలేసిన ట్యాంకర్ల తరలింపు
- June 20, 2016
పార్కింగ్ లాట్స్లో వదిలేసిన 120 ట్యాంకర్లను అబుదాబీ మునిసిపాలిటీ, తరలించింది. డౌన్టౌన్ అబుదాబీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని బనియాస్ ఈస్టర్న్ సెక్టార్స్ వరకు నిర్లక్ష్యంగా వదిలేసిన ట్యాంకర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. ముందస్తుగా వాహనాల్ని తరలించాల్సిందిగా ట్యాంకర్ యజమానులకు సమాచారం ఇచ్చినా, స్పందించకపోవడంతో మునిసిపాలిటీ ఈ ట్యాంకర్లను అక్కడినుంచి తరలించింది. ఇందుకుగాను 3,000 దిర్హామ్లు జరిమానా కూడా విధించింది మునిసిపాలిటీ. జరీమానా చెల్లించనిదే ట్యాంకర్ల వద్దకు వెళ్ళేందుకు యజమానులకు అనుమతి లేదు. ఈ జరీమానాకి అదనంగా, ట్యాంకర్లను తరలించి నిలిపివేసినందుకు, తరలించడానికి అయ్యే ఖర్చుల్ని సైతం వసూలు చేయనునన్నారు. 2012 లా నెంబర్ 2 ప్రకారం, నిబంధనల్ని ఉల్లంఘించినవారికి రి-కాన్సిలేషన్ అలాగే 50 శాతం జరీమానాలో డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. పదే పదే ఈ నిబంధనల ఉల్లంఘన కొనసాగేవారికి జరీమానా రెట్టింపు కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







