జెట్ ఎయిర్ వేస్ ఇన్నోవేటివ్ బుకింగ్
- June 20, 2016
ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్, సరికొత్త బుకింగ్ ఫీచర్ ఫేర్ లాక్ని ప్రారంభించింది. జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్, మొబైల్ యాప్ల ద్వారా బుక్ చేసుకునే వినియోగదారుల కోసం ఈ ఫేర్ లాక్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫేర్ లాక్లో సభ్యత్వం కోసం అంతర్జాతీయ ప్రయాణీకులు 4 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు అందులోంచి మినహాయించబడుతుంది. తమకు కావాల్సిన సమయంలో విమాన ప్రయాణం చేసుకోవడంతోపాటు, టిక్కెట్ ఫేర్ని కూడా లాక్ చేసుకోవడం ఈ ఫేర్ లాక్ స్పెషాలిటీ. మస్కట్ నుంచి కోచి, తిరువనంతపురం, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఈ ఫేర్లాక్ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంతో ఎయిర్ లైన్స్ రంగంలో జెట్ ఎయిర్ వేస్ కొత్త అధ్యాయానికి తెరలేపిందనీ, ఇది వినియోగదారులకు ఎంతో అందుబాటులో ఉంటుందని, ఈ పథకం విజయవంతమవుతుందని ఆశిస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ మన్ను ఆనంద్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







