మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
- September 30, 2024
న్యూఢిల్లీ: భారతీయ సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. ఈ ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఆయన ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయనను ఈ అవార్డుతో సత్కరించడం జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ వార్తను పంచుకున్నారు. “మిథున్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే ఎంపిక జ్యూరీ ఈ దిగ్గజ నటుడిని ఎంపిక చేసిందని ప్రకటించడం గౌరవంగా ఉంది” అని ట్వీట్ చేశారు.
ఇక ఈ ఏడాది మిథున్ను ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు కూడా వరించిన విషయం తెలిసిందే. ఈ సీనియర్ నటుడు 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ‘మృగయా’తో తెరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును సైతం గెలుచుకున్నారు. 1980వ దశకంలో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. 1979లో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘సురక్షా’ చిత్రం ద్వారా ఆయన స్టార్డమ్ బాగా పెరిగింది. ఆ తర్వాత ‘డిస్కో డాన్సర్’, ‘డ్యాన్స్ డ్యాన్స్’, ‘ప్యార్ ఝుక్తా నహీ’, ‘కసమ్ పైదా కర్నే వాలేకి’, ‘కమాండో’ వంటి సూపర్ హిట్స్ కొట్టారు మిథున్ చక్రవర్తి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







