'తిరుమల లడ్డూ కల్తీ' పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ..
- September 30, 2024
న్యూ ఢిల్లీ: తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని చెప్పింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారని పేర్కొంది. మతంతో రాజకీయాలను కలపకూడదని తెలిపింది. కల్తీ నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిప్టోర్ ప్రాథమికంగా చూపలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తిరుపతి లడ్డూకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 20న చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు.. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఇప్పటికే విచారణకు ఆదేశించితే మరి మీడియా ముందుకు వెళ్లవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.
ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది జులైలోనని, సీఎం ప్రకటన చేసింది సెప్టెంబర్లోనని చెప్పింది. అసలు రిపోర్టు స్పష్టంగా లేదని తెలపడం గమనార్హం. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారన్నడానికి ఆధారాలేంటి అని ప్రశ్నించింది. కాగా, ఎన్ని నెయ్యి ట్యాంకర్లను వాడారన్న వివరాలను సుప్రీంకోర్టుకు టీటీడీ న్యాయవాది తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







