మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- March 08, 2026
హైదరాబాద్: ప్రజాభవన్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలను ప్రభుత్వం ఇవాళ ఘనంగా నిర్వహించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల్ని ప్రభుత్వం సత్కరించింది.ఈ వేడుకల్లో సీఎం రేవంత్ స్వయంగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ మహిళలు తయారుచేసే వస్తువులకు అమెజాన్లో అమ్మకానికి అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మహిళ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం కల్పించే అవకాశాలు అందిపుచ్చుకుని మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి.
తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉంది. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్గా మహిళలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు. త్వరలోనే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం. మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. వారి కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. డ్వాక్రా సంఘాల ద్వారా రుణం అందిస్తున్నాం. గృహలక్షి పథకం ద్వారా సబ్సిడీకి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తున్నాం ” అంటూ రేవంత్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









