ముంబైలో అగ్ని ప్రమాదం-ఐదుగురు దుర్మరణం
- October 06, 2024
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం..ముంబైలోని చెంబూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చలరేగాయి.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలు వ్యాపించిన సమయంలో ఆ కుటుంబం నిద్రలో ఉండడంతో తప్పించుకోలేకపోయారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. బాధితులను రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!









