మోసపోయిన ఏపీ మహిళ...కువైట్ పేరు చెప్పి మస్కట్ తీసుకుపోయాడు!
- October 06, 2024
మస్కట్: ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళ దారుణంగా మోసపోయింది. ఓ ఏజెంట్ చేతిలో మోసపోయిన యువతి….కువైట్ పేరు చెప్పి మస్కట్ తీసుకుపోయాడంటూ సెల్పీ వీడియో ద్వారా పేర్కొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా లోని చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన వివాహిత దేవి...ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాలని అనుకుంది. అయితే.. ఆ ఏజెంట్..కువైట్ పేరు చెప్పి.. మస్కట్ తీసుకువెళ్లాడట.
తనకు కువైట్ పేరు చెప్పి.... మస్కట్ తీసుకువచ్చాడని అక్కడ రెండు నెలలు ఒక ఆఫీసులో ఉద్యోగం చేయాలని వేధించాడని బాధిత మహిళ వీడియో లో పేర్కొంది. ఆ తర్వాత, ఒక బడా వ్యాపారి ఇంట్లో వెట్టిచాకిరి చేయాలని టార్చర్ చేశాడట. గత కొంతకాలంగా బడా వ్యాపారి ఇంట్లో వెట్టిచాకిరి చేస్తున్నానని...అక్కడ పని భారం ఎక్కువయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తెలిపింది బాధితురాలు. ప్రస్తుతం తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఏజెంట్ కు చెబితే... నేను చేసేది ఏమీ లేదని చేతులెత్తేసాడని పేర్కొంది. తిరిగి ఇండియాకు రావాలంటే నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా వివరించింది. చంద్రబాబు సర్కార్ సాయం చేయాలని కోరింది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







