ఎయిర్‌పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్‌ ఎంపీ బాలశౌరి

- October 06, 2024 , by Maagulf
ఎయిర్‌పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్‌ ఎంపీ బాలశౌరి

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో శనివారం జరిగిన ఎయిర్‌పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో అడ్వైసరీ కమిటీ ఛైర్మన్‌, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొని విమానాశ్రయంలో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు.నూతన టెర్మినల్‌ పనులు వేగవంతంగా చేసి, విదేశాలకు విమాన సర్వీసులు తీసుకురావాలన్నారు. ఇతర ఇబ్బందులు ఎమైనా ఉంటే జిల్లా కలెక్టర్‌, సంబంధిత అధికారులు పరిష్కరించాలని అన్నారు.కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మి కాంత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com