ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దు: మంత్రి జూపల్లి
- October 06, 2024
దుబాయ్: మన విశిష్ఠ సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని,ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి, సాంప్రదాయలను మరవొద్దని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.రెండు రోజుల దుబాయ్ పర్యాటనలో భాగంగా పర్యాటక అభివృద్ధి, ప్రమోషన్ వంటి అంశాలపై ఓ హోటల్ లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక శాఖ అధికారి జాసిం మొహమద్ అల్ అవాదీ, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తో కలిస పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను మంత్రి జూపల్లి కృష్ణారావు అడిగి తెలుసుకున్నారు.మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో దుబాయ్ లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ...నేటి శాస్త్ర, సాంకేతిక యుగంలో మన సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు ద్వంసం కావడం వల్ల సమాజంలో చాలా రుగ్మతలకు దారితీస్తుందని, వాటి విలువను బావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.మన సంపదను పదిమంది మంచికి ఉపయోగించాలని సూచించారు.
బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతాయని,బతుకమ్మ పండుగ మహిళ శక్తిని చాటుతుందని,తెలంగాణ ఉద్యమాన్ని సంఘటిత శక్తిగా మార్చడంలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







