విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు..
- October 06, 2024
అమెరికా: ఘోర ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దట్టమైన పొగలు కమ్ముకోవటంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదపు చేశారు. విమానాశ్రయం సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో మొత్తం 190మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ కు ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానం వెళ్తుంది. అయితే, విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. చూస్తుండగానే మంటలు పెద్దవి అవుతున్న క్రమంలో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.. ఫైరిజన్లు వేగంగా విమానం వద్దకు తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానంలో నుంచి కిందికి తీసుకొచ్చి బస్సులో టెర్మినల్ కు తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతోపాటు విమానాశ్రయ ఉన్నతాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగడంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









