క్లెయిమ్ చేయని డివిడెండ్ల చెల్లింపు..కొత్త ఇ-సేవా ఛానెల్లు ప్రారంభం..!!
- October 08, 2024
యూఏఈ: సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA) ద్వారా స్థానికంగా లిస్టెడ్ పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీల వాటాదారులకు క్లెయిమ్ చేయని డివిడెండ్ల (మార్చి 2015కి ముందు నాటిది) చెల్లింపు కోసం ఇ-సేవ ప్రారంభించింది. అబుదాబి బ్యాంక్ (FAB) సహకారంతో ఈకార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు సేవా ఛానెల్లను అందించడానికి, వారి డివిడెండ్లను క్లెయిమ్ చేయడానికి సులభంగా మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఇ-సేవ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి, అదే సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఉండాలనే ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. FAB వెబ్సైట్ని ఉపయోగించి వారి చెల్లింపు అభ్యర్థనల స్థితిని ట్రాక్ చేయవచ్చని వాటాదారులకు సూచించారు. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత 10పని దినాలలో ఖాతాదారునికి డివిడెండ్లను బదిలీ చేస్తుందన్నారు. మార్చి 2015కి ముందు నాటి తమ అన్క్లెయిమ్డ్ డివిడెండ్లను సులభంగా పొందేందుకు పెట్టుబడిదారులు కష్టపడి పని చేస్తూనే ఉంటారని SCA స్పష్టం చెసింది.
యూఏఈ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) మొదటి ఓవర్సీస్ క్యాంపస్ వచ్చే ఏడాది ప్రారంభంలో దుబాయ్లో ప్రారంభించబడుతుందని భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్యాంపస్ దుబాయ్లోని ఎక్స్పో సిటీలోని ఇండియా పెవిలియన్ నుండి పని చేస్తుందని, స్వల్ప మరియు మధ్యకాలిక శిక్షణా కార్యక్రమాలతో పాటు పరిశోధన అవకాశాలను అందించడం ద్వారా దాని కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు. ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. IIFT కొత్త దుబాయ్ క్యాంపస్ యూఏఈ నుండి మాత్రమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో శిక్షణ, పరిశోధన అవకాశాలను కోరుకునే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి విద్యార్థులు, నిపుణులను ఆకర్షిస్తుందని భారతదేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఆకాంక్షించారు. ఈ సంస్థ 1963లో భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ క్రింద ఒక స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించారు. డీమ్డ్ యూనివర్సిటీ హోదాను IIFT కలిగి ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి