అల్ అయిన్లో 110 కిలోల హాషిష్ పట్టివేత
- June 21, 2016
అబుదాబీ పోలీసులు 110 కిలోల హాషిస్ని స్వాధీనం చేసుకున్నారు. అల్ అయిన్లో ఈ హాషిన్ పోలీసులకు చిక్కింది. పక్కా సమాచారంతో అబుదాబీ పోలీసులు ఈ రాకెట్ని భగ్నం చేయగలిగారు. అత్యంత సీక్రెట్గా ఈ ఆపరేషన్ జరిగింది. ఇద్దరు అనుమానితుల్ని రహస్యంగా ఫాలో అయిన పోలీస్ అధికారులు, రెడ్ హ్యాండెడ్గా పెద్ద మొత్తంలో హాషిస్ని, రాకెట్ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. కారు ఫ్యూయల్ ట్యాంక్లో నింపిన హాషిస్ డ్రగ్స్ని ఇసుకలో పాతి పెడుతుండగా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతకు డ్రగ్స్ సరఫరా చేయడం ద్వారా సమాజంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కొందరు ప్రయతినస్తున్నారనీ, ఇలాంటి చర్యల్ని సహించబోమని అబుదాబీ పోలీస్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తౌమ్ అల్ షరిఫి చెప్పారు. డ్రగ్స్తో జీవితాలు నాశనమైపోతాయనీ, ఈ విషయమై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ ఎవరికైనా డ్రగ్స్కి సంబంధించి చిన్న సమాచారం అందినా, పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







