రతన్జీ ప్రేమ కథ
- October 10, 2024
1937 డిసెంబర్ 28న ముంబయిలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు రతన్ నావల్ టాటా. అయితే పదేళ్ల వయసులోనే ఆయన తల్లి, తండ్రి విడిపోవటం వల్ల చిన్నారి రతన్ టాటా అలాగే తమ్ముడు జిమ్మీని నాయనమ్మ నవాజ్ బాయి టాటా పెంచి పెద్దచేశారు.దీంతో రతన్ బాల్యమంతా తన బామ్మ దగ్గరే గడిపారు.ముంబయి, సిమ్లాలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆపై విదేశాలకు పయనమయ్యారు. అక్కడ అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చరల్ డిజైనింగ్ ప్రధానాంశంగా 'బీఆర్క్' కోర్స్ను కంప్లీట్ చేశారు.
రతన్ టాటా ప్రేమ ప్రయాణం
గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక టాటాకు లాస్ఏంజిలిస్లోని జోన్స్ అండ్ ఎమ్మోన్స్(Jones and Emmons) ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆయన సుమారు రెండేళ్ల పాటు పనిచేశారు. అప్పుడే ఆయనకు ఐబీఎంలో (IBM) ఆఫర్ వచ్చింది. అంతలోనే స్వదేశం నుంచి ఆయనకు హఠాత్తుగా ఓ కబురు వచ్చింది. అది ఆయనను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అన్నీ తానై పెంచిన నాయనమ్మ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో రతన్ టాటాను ఉన్నపళంగా ఇండియా వచ్చేయాలంటూ ఆమె నుంచి పిలుపు వచ్చింది.తమ సొంత వ్యాపారంలో టాటాలకు అండగా ఉండాలంటూ ఆమె రతన్ టాటాను కోరారు.
కానీ తను పనిచేసే సంస్థలోనే సహ ఉద్యోగి అయిన ఓ అమెరికన్ యువతిని ఆయన ప్రేమించారు. వీరిద్దరి పరిచయం కాస్త ప్రణయంగా మారింది.పెళ్లి చేసుకొని ఓ కొత్త లైఫ్ను స్టార్ట్ చేద్దామని కలలు కంటున్న వేళ కలవరపరిచే ఘటనలు ఆయన్ను చుట్టుముట్టాయి.దీంతో తనతో ఇండియా వచ్చేయాలంటూ ప్రేయసిని రతన్ టాటా కోరారు. కానీ దానికి ఆ యువతి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడు ఇండో చైనా యుద్ధం నడుస్తున్నందున ఇటువంటి పరిస్థితులలో తమ కుమార్తెను ఇండియాకు పంపబోమని వారు తేల్చి చెప్పారు.
ఓ వైపు ఇండియా వచ్చేయాలన్న నాయనమ్మ కోరికను మన్నించాలా? లేకుంటే తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి అమెరికాలోనే ఉండిపోవాలా? అనే ప్రశ్నలు రతన్ టాటాను సందిగ్ధంలో నెట్టేశాయి.కానీ మాతృదేశం మీద ఆయనకున్న మమకారం, నాయనమ్మ అనురాగం ఆయన్ని తిరిగి సొంత దేశానికి వచ్చేలా చేశాయి.అలా 1962లో రతన్ టాటా భారత్కు తిరిగి వచ్చారు. నాయనమ్మ పిలుపే రతన్ టాటా జీవితానికి మలుపైంది. కానీ ఒక్కరినే ప్రేమించి వారినే పెళ్లాడలన్న తన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్న ఆయన తన ప్రేయసి స్మృతులతో అలాగే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









