చట్టవిరుద్ధంగా తొలగింపు.. కార్మికుడికి BD8,000 పరిహారం..!!
- October 10, 2024
మనామా: రెండు సంవత్సరాల నుంచి వేతనాలు చెల్లించని యజమానిపై కార్మికుడు కేసు గెలిచాడు. చట్ట విరుద్ధంగా విధుల నుంచి తొలగించినందుకు జరిమానాల రూపంలో అతనికి BD8,000 చెల్లించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. మూడేళ్ల సర్వీసు తర్వాత ఎలాంటి కారణం లేకుండా తొలగించారని కార్మికుడు కోర్టును ఆశ్రయించాడు. అతను BD500 నెలవారీ వేతనంతో ఓపెన్-ఎండ్ కాంట్రాక్టులో ఉన్నాడని, అక్టోబర్ 2021 నుండి మార్చి 2024 వరకు అతను వేతనం పొందలేదని కోర్టుకు తెలిపాడు. తక్కువ ఆదాయం, తక్కువ ఆర్డర్ల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది ఉందని యజమాని పేర్కొన్నారు. కాగా, తొలగింపుకు సరైన కారణాన్ని అందించడంలో కంపెనీ విఫలమైనందున, కార్మికుడిని తప్పుగా తొలగించారని కోర్టు గుర్తించి ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









