బెట్టింగ్ లో పోయిన సొమ్ము పై కేసు వేయడం సాధ్యపడుతుందా..?
- October 11, 2024
భారతదేశంలో బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధం అయినప్పటికీ, ఇది ఇంకా అనధికారికంగా కొనసాగుతోంది. ప్రస్తుతం క్రికెట్ వంటి క్రీడలు ప్రధానంగా బెట్టింగ్కు కేంద్రంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ నిర్వహణలో మొబైల్ యాప్స్, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇందులో బుకీలు తమ నెట్వర్క్ ద్వారా పందాలు స్వీకరిస్తారు.. పోలీసులు తరచుగా దాడులు చేస్తారు.. ఇలా బెట్టింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాపారం అధిక లాభాలను అందిస్తుంది, కానీ బెట్టింగ్ అనేది చట్టబద్ధం కాదు బెట్టింగుకు పాల్పడడం అనేది చట్టవిరుద్దం.
ఇక భారతదేశంలో బెట్టింగ్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. బెట్టింగ్ అనేది భారతదేశంలో చట్టబద్ధం కాదు. 1867లో ప్రవేశపెట్టిన పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం, బెట్టింగ్ మరియు జూదం రెండు కూడా చట్టవిరుద్ధం. ఈ చట్టం ప్రకారం, బెట్టింగ్ కు పాల్పడడం లేదా జూదం ఆడడం మరియు నిర్వహించడం నిషేధించబడ్డాయి. ఇంకా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బెట్టింగుకు పాల్పడితే వారికి శిక్షలు విధించబడతాయి. అందుకే బెట్టింగ్ అనేది చట్ట విరుద్ధమైనప్పుడు బెట్టింగ్ కి పాల్పడి బెట్టింగ్లో పోయిన సొమ్ము పై కేసు వేయడం సాధ్యపడదు, ఎందుకంటే చట్టం ప్రకారం బెట్టింగ్లో పాల్గొనడం నేరం కాబట్టి.
అయితే భారతదేశంలో బెట్టింగ్ చట్టాలు 1867 నాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆధారంగా.. ఈ చట్టం ప్రకారం, బెట్టింగ్ లేదా జూదం నిర్వహించడం, లేదా వాటిలో పాల్గొనడం నేరం అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు తమ స్వంత చట్టాలను రూపొందించుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా గోవా మరియు సిక్కిం లాంటి రాష్ట్రాలు జూదం మరియు బెట్టింగ్ను చట్టబద్ధం చేశాయి. ఈ రాష్ట్రాల్లో కొన్ని కాసినోలు మరియు బెట్టింగ్ సెంటర్లు ఉన్నాయి, కానీ అవి కేవలం ఆ రాష్ట్రాల పరిధిలోనే చట్టబద్ధం.
ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ కూడా భారతదేశంలో చట్టబద్ధం కాదు. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు భారతదేశంలో నిషేధించబడ్డాయి. మరియు వాటిని ఉపయోగించడం కూడా నేరం. మొత్తానికి, భారతదేశంలో బెట్టింగ్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, మరియు బెట్టింగ్లో పాల్గొనడం నేరం. బెట్టింగ్లో పోయిన సొమ్ము పై కేసు వేయడం సాధ్యపడదు, ఎందుకంటే చట్టం ప్రకారం అది నేరం.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









