మంత్రి లోకేష్ అక్టోబర్ 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికా పర్యటన
- October 11, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగే ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరుకానున్నారు.ఈ సదస్సులో, లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఎందుకంటే లోకేష్ గారు రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ టెక్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.ఇటీవల, ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10,000 ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇంకా లోకేష్ ఈ పర్యటనలో మరిన్ని ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రాష్ట్రంలోకి రప్పించి, లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయనున్నారు.ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రాబట్టడం, మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా, లోకేష్ అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను వివరించనున్నారు.ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి, మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









