తిరుచిరాపల్లి నుంచి షార్జా విమానానికి తప్పిన పెను ప్రమాదం..
- October 11, 2024
తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఆ విమానంలోని 141 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎయిరిండియా బోయింగ్ విమానం తిరుచ్చి ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎయిరిండియా విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్ దెబ్బతినడంతో దాదాపు 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి ల్యాండింగ్ గేర్ ఓపెన్ కావడంతో పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి సేఫ్ ల్యాండింగ్ చేశారు.కాగా, అంతకు ముందు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రమాదం జరగొచ్చని అంతా భయపడ్డారు. విమానంలో 141 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.
మరోవైపు ప్రమాదం జరగొచ్చనే భయంతో..ముందుగానే ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా అంబులెన్సులు, ఫైరింజన్లు రెడీ చేశారు. అయితే, ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్.. తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్తోంది. ఇంతలో హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య తలెత్తింది. దీంతో దాదాపు మూడు గంటల పాటు విమానం గాల్లోనే ఉండిపోయింది.దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి పైలెట్లు విమానాన్ని రాత్రి 8 గంటల 14 నిమిషాలకు సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. పైలెట్ నిరంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదింపులు జరిపారు. బెల్లీ ల్యాండింగ్ చేయాలని అధికారులు సూచించారు.చివరికి నార్మల్ ల్యాండింగ్ చేశారు.ఈ ఘటనను సివిల్ ఏవియేషన్ సీరియస్ గా తీసుకుంది.దీని పై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలేం జరిగింది? ఎందుకీ సమస్య తలెత్తింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ 613 విమానం తిరుచిరాపల్లి నుండి షార్జాకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొంతసేపటికే హైడ్రాలిక్ సమస్య తలెత్తింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









