టాటా ట్రస్ట్ ఛైర్మన్గా నోయెల్ టాటా..
- October 11, 2024
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటా ట్రస్ట్లను ఎవరు వారసులుగా ఉంటారని చర్చలు జోరుగా సాగాయి. ఈ క్రమంలో టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా నోయెల్ టాటాను ఎన్నుకున్నారు.
రతన్ టాటా సవతి తల్లి కుమారుడు నోయెల్ నావల్ టాటా ట్రస్ట్ ఛైర్మన్గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే ఏకగ్రీవంగా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. టాటా వారసత్వాన్ని అతనే సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని భావించి అతన్ని ఎన్నుకున్నారు. నావల్ టాటా, సిమోన్ (రెండో భార్య) టాటాల కుమారుడే నోయెల్.ప్రస్తుతం నోయెల్ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ ఛైర్మన్గా ఉన్నారు.
అలాగే టాటా స్టీల్, టైటాన్ వైస్ చైర్మన్గా కూడా నోయెల్ టాటా ఉన్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కే ఎక్కువగా 66% వాటా ఉంది. దీనివల్ల టాటా ఛైర్మన్కు హోదాలో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో నోయల్ టాటాకు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









