టాటా ట్రస్ట్ ఛైర్మన్గా నోయెల్ టాటా..
- October 11, 2024
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటా ట్రస్ట్లను ఎవరు వారసులుగా ఉంటారని చర్చలు జోరుగా సాగాయి. ఈ క్రమంలో టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా నోయెల్ టాటాను ఎన్నుకున్నారు.
రతన్ టాటా సవతి తల్లి కుమారుడు నోయెల్ నావల్ టాటా ట్రస్ట్ ఛైర్మన్గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే ఏకగ్రీవంగా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. టాటా వారసత్వాన్ని అతనే సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని భావించి అతన్ని ఎన్నుకున్నారు. నావల్ టాటా, సిమోన్ (రెండో భార్య) టాటాల కుమారుడే నోయెల్.ప్రస్తుతం నోయెల్ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ ఛైర్మన్గా ఉన్నారు.
అలాగే టాటా స్టీల్, టైటాన్ వైస్ చైర్మన్గా కూడా నోయెల్ టాటా ఉన్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కే ఎక్కువగా 66% వాటా ఉంది. దీనివల్ల టాటా ఛైర్మన్కు హోదాలో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో నోయల్ టాటాకు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







