టాటా ట్రస్ట్ ఛైర్మన్గా నోయెల్ టాటా..
- October 11, 2024
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటా ట్రస్ట్లను ఎవరు వారసులుగా ఉంటారని చర్చలు జోరుగా సాగాయి. ఈ క్రమంలో టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా నోయెల్ టాటాను ఎన్నుకున్నారు.
రతన్ టాటా సవతి తల్లి కుమారుడు నోయెల్ నావల్ టాటా ట్రస్ట్ ఛైర్మన్గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే ఏకగ్రీవంగా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. టాటా వారసత్వాన్ని అతనే సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని భావించి అతన్ని ఎన్నుకున్నారు. నావల్ టాటా, సిమోన్ (రెండో భార్య) టాటాల కుమారుడే నోయెల్.ప్రస్తుతం నోయెల్ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ ఛైర్మన్గా ఉన్నారు.
అలాగే టాటా స్టీల్, టైటాన్ వైస్ చైర్మన్గా కూడా నోయెల్ టాటా ఉన్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కే ఎక్కువగా 66% వాటా ఉంది. దీనివల్ల టాటా ఛైర్మన్కు హోదాలో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో నోయల్ టాటాకు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









