ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక సంబంధాలు.. అనేక రంగాల్లో కొత్తగా భాగస్వామ్యం..!!
- October 14, 2024
మాస్కో: ఒమన్-బెలారస్ అనేక రంగాలలో మంచి సంబంధాలు, పరస్పర సహకారాన్ని పెంపొందించుకున్నాయని రష్యన్ ఫెడరేషన్లోని ఒమన్ సుల్తానేట్ రాయబారి, బెలారస్ రిపబ్లిక్లో ఒమన్ నాన్ రెసిడెంట్ రాయబారి హమూద్ సలీమ్ అల్ తువైహ్ ధృవీకరించారు. బెలారస్ ప్రధాన మంత్రి రోమన్ గోలోవ్చెంకో ఒమన్లో చేసిన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, సహకారాన్ని పెంపొందించడానికి, వివిధ రంగాలలో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తుందని అల్ తువైహ్ తెలిపారు. బెలారస్ ప్రధాని పర్యటన ద్వారా రెండు దేశాలు ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకునేందుకు ఎదురు చూస్తున్నాయని అల్ తువైహ్ స్పష్టం చేశారు. ఈ పర్యటన రెండు దేశాల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహం, రక్షణకు సంబంధించిన ఒప్పందం (10 మే 2004న సంతకం చేయబడింది), ఆర్థిక వాణిజ్య సహకారంపై ఒప్పందం (2007లో సంతకం చేయబడింది), ద్వంద్వ పన్నుల నివారణపై ఒప్పందంతో సహా పలు రంగాల్లో అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు ఇంతకుముందు సంతకాలు చేశాయని అల్ తువైహ్ గుర్తుచేశారు. ఒమన్ -బెలారస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు జూలై 23, 1992న ఏర్పాటయ్యాయని, బెలారస్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ ఏప్రిల్ 2007లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్కు అధికారిక పర్యటన చేశారని, ఆ సమయంలో దివంగత సుల్తాన్ ఖబూస్ బిన్ అందుకున్నారని అల్ తువైహ్ తెలిపారు. ఆర్థికం, వాణిజ్యం, వాణిజ్య వినిమయం, పెట్టుబడి, సాంకేతికత, ఇంధనం, ప్రత్యామ్నాయ ఇంధన రంగాలలో తమ ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకునే అవకాశాలను రెండు దేశాలు అధ్యయనం చేస్తున్నాయని అల్ తువైహ్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి