ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం
- October 14, 2024
అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తుండగా.. మరికొన్నింటిని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ప్రకటించింది. గతంలో ఈ రుణాల పరిమితి రూ.2 లక్షలుగా ఉండేది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా రూ.50వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందించనుంది. 2024-25 ఏడాదికి సంబంధించి రూ.250 కోట్లను రుణంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద, డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు ఈ రుణాలు అందించనున్నారు. ఈ రుణాలు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు ఉపయోగపడతాయి.
ఈ రుణంపై వడ్డీ ఉండదు, అంటే మహిళలు తీసుకున్న రుణాన్ని వడ్డీ లేకుండా తిరిగి చెల్లించవచ్చు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రాయితీ రూ.180 కోట్లు, మిగతా రూ.320 కోట్లు వడ్డీలేని రుణంగా అందిస్తారు. నవంబరు నుంచి లబ్ధిదారుల ఎంపిక మొదలవుతుంది.
ఈ రుణాలు ప్రధానంగా వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ రంగం, సేవారంగాల్లో ఉన్నవారికి అందిస్తారు. రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించే లబ్ధిదారులు ఈ పథకం ద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా మహిళలు తమ స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకోవచ్చు లేదా విస్తరించుకోవచ్చు. ఈ రుణ పరిమితిని రూ.5లక్షల వరకు పెంచడం డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







