'గల్ఫ్ చేసిన మేలు' పాట విడుదల చేసిన సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్
- October 14, 2024
దుబాయ్: తెలంగాణ యువకులకు గల్ఫ్ దేశాలు ఎంత గానో ఆదుకున్నాయి అని , అక్కడి ప్రజల గొప్పతనం మరియు వారు మన కార్మికులకు ఇచ్చిన ఉపాధి గురించి చెపుతూ దుబాయ్ లో ఉండే జగిత్యాల జిల్లాకు చెందిన సింగర్ & రైటర్ మల్లేష్ కోరేపు రాసిన 'గల్ఫ్ చేసిన మేలు' ఆల్బమ్ పాటను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ జత చేసి పాడారు, పాట ఆడియో స్వయంగా దుబాయ్ వెళ్లి స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాల వేదికగా CD పోస్టర్ ని రిలీజ్ చేశారు. నా పాట వందే మాతరం సార్ పాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని పాట ఖర్చులకు ఆర్థిక సహాయం చేసిన దుబాయ్ ప్రముఖులు తోట రాం కుమార్, సత్యం రాధారపు , మోతె రాములు, మనోజ్ పటేల్, సుతారి సత్యం, కొట్టాల సత్యనారాయణ గౌడ్ మరియు స్పార్క్ మీడియా అరుణ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంత గొప్ప పాటను వీడియో కూడా చేయించాలని అందుకు కూడా మీరే ముందుండి మల్లేష్ కు సహకరించాలని వందే మాతరం శ్రీనివాస్ వారిని ప్రత్యేకంగా కోరారు.
ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఫెమ్ డాన్సర్ నాగ దుర్గ, రేడియో ఖుషి 92.2 FM టీమ్, మా గల్ఫ్ శ్రీకాంత్, T Homes రియల్ ఎస్టేట్ వైకుంఠ రావు, లావణ్య, జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







