ఢిల్లీలో జనవరి 1 వరకు టపాసులపై నిషేధం
- October 14, 2024
న్యూ ఢిల్లీ: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1 వరకు అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని అన్ని రకాల బాణసంచా వాడకం, తయారీ, నిల్వ, విక్రయాలను జరపకూడదని చెప్పింది.
ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫాంలలోనూ టపాసులను అమ్మడానికి వీలులేదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటీసును ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్లో షేర్ చేశారు. చలికాంలో ఢిల్లీలో వాయుకాలుష్య సమస్య మరింత తీవ్రతరమవుతుందని, బాణసంచా కూడా అందుకు కారణమవుతుందని చెప్పారు.
చలికాలంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసులపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ప్రజలందరు సహకారం అందించాలని కోరింది. మరోవైపు, ఢిల్లీలో గాలి నాణ్యత సోమవారం ప్రమాదకర కేటగిరీ స్థాయికి దిగజారింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇవాళ ఉదయం 370గా ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







