ఢిల్లీలో జనవరి 1 వరకు టపాసులపై నిషేధం
- October 14, 2024
న్యూ ఢిల్లీ: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1 వరకు అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని అన్ని రకాల బాణసంచా వాడకం, తయారీ, నిల్వ, విక్రయాలను జరపకూడదని చెప్పింది.
ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫాంలలోనూ టపాసులను అమ్మడానికి వీలులేదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటీసును ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్లో షేర్ చేశారు. చలికాంలో ఢిల్లీలో వాయుకాలుష్య సమస్య మరింత తీవ్రతరమవుతుందని, బాణసంచా కూడా అందుకు కారణమవుతుందని చెప్పారు.
చలికాలంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసులపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ప్రజలందరు సహకారం అందించాలని కోరింది. మరోవైపు, ఢిల్లీలో గాలి నాణ్యత సోమవారం ప్రమాదకర కేటగిరీ స్థాయికి దిగజారింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇవాళ ఉదయం 370గా ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి