ఢిల్లీలో జనవరి 1 వరకు టపాసులపై నిషేధం
- October 14, 2024
న్యూ ఢిల్లీ: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి 1 వరకు అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని అన్ని రకాల బాణసంచా వాడకం, తయారీ, నిల్వ, విక్రయాలను జరపకూడదని చెప్పింది.
ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫాంలలోనూ టపాసులను అమ్మడానికి వీలులేదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటీసును ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్లో షేర్ చేశారు. చలికాంలో ఢిల్లీలో వాయుకాలుష్య సమస్య మరింత తీవ్రతరమవుతుందని, బాణసంచా కూడా అందుకు కారణమవుతుందని చెప్పారు.
చలికాలంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసులపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ప్రజలందరు సహకారం అందించాలని కోరింది. మరోవైపు, ఢిల్లీలో గాలి నాణ్యత సోమవారం ప్రమాదకర కేటగిరీ స్థాయికి దిగజారింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇవాళ ఉదయం 370గా ఉంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









